కర్ణాటకలోని హుబ్బల్లి జిల్లాలో తాజాగా దారుణం జరిగింది. వీరాపూర్ ఓని గ్రామానికి చెందిన 21 ఏళ్ల విశ్వ అలియాస్ గిరీష్ సావంత్, పొరుగింటి యువతి అంజలి అంబిగేరా (20)ను ప్రేమ పేరుతో వేధించేవాడు. ఇవాళ తెల్లవారుజామున ఆమె ఇంట్లోకి చొరబడి లైంగిక దాడికి ప్రయత్నించగా ఆమె ఒప్పుకోలేదు. దీంతో గిరీష్ ఆగ్రహానికి గురై.. అంజలిని కత్తితో పొడిచి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.