నీట్‌ పిటిషన్లపై రేపు సుప్రీంకోర్టులో విచారణ

65చూసినవారు
నీట్‌ పిటిషన్లపై రేపు సుప్రీంకోర్టులో విచారణ
దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్‌ పేపర్ లీకేజీపై ఇప్పటికే చాలా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వాటిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. కాగా, గతంలో విచారణ చేసిన సుప్రీంకోర్టు సెంటర్ల వారీగా ఫలితాలను విడుదల చేయాలని ఆదేశించింది. పేపర్ లీకేజీ, మార్కుల విషయంలో పలు ఆరోపణలతో సతమతమవుతున్న మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శనివారం విడుదల చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్