ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ నేత మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్పై ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు విచారించనుంది. ప్రస్తుతం సిసోడియా జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. గతేడాది మార్చిలో అరెస్ట్ అయిన సిసోడియా పలుమార్లు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిని ట్రయల్ కోర్టు, మరోసారి ఢిల్లీ హైకోర్టు, ఒకసారి సుప్రీం కోర్టు ఆయన బెయిల్ అభ్యర్థనను కొట్టేశాయి.