విశాఖలో బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు పేరిట పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. జన జాగరణ సమితి పేరిట ఆంధ్రా యూనివర్సిటీలో పోస్టర్లు వెలిశాయి. విశాఖ ఎంపీ సీటు జీవీఎల్కే కేటాయించాలంటూ పోస్టర్లపై రాతలు రాశారు. విశాఖ అభివృద్ధి కోసం పార్లమెంట్లో జీవీఎల్ గళం వినిపించారని, ఆయనకే టికెట్ కేటాయించాలని పోస్టర్లు వెలిశాయి. కాగా, పొత్తులో భాగంగా విశాఖ ఎంపీ సీటు టీడీపీకి వెళ్లింది.