చెన్నై ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. సింగపూర్ నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న రూ.8.5 కోట్ల విలువైన 13.5 కిలోల బంగారం కడ్డీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయ సిబ్బంది సహకారంతో స్మగ్లింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు.