అర్థరాత్రి పొలంలో పూజలు చేస్తున్న హిజ్రాలు, భయంలో గ్రామస్తులు (వీడియో)

59చూసినవారు
మహబూబాబాద్ జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. బ్రాహ్మణపల్లి గ్రామంలోని ఓ రైతు పొలంలో శుక్రవారం అర్థరాత్రి పది మంది హిజ్రాలు కలిసి క్షుద్ర పూజలు చేసేందుకు ప్రయత్నించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు పూజలను ఆపి, హిజ్రాలను మందలించారు. అయితే, పుట్ట మన్ను తీసుకెళ్లి పూజ చేయడం తమ ఆచారమని.. తాము ఎలాంటి క్షుద్ర పూజలు చేయట్లేదని హిజ్రాలు తెలిపారు. మరోవైపు అమావాస్య రోజులు కావడంతో వారు క్షుద్రపూజలు చేసేందుకు వచ్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్