భారీ పేలుడు.. ఇద్దరు సజీవదహనం, ఆరుగురికి గాయాలు

72చూసినవారు
భారీ పేలుడు.. ఇద్దరు సజీవదహనం, ఆరుగురికి గాయాలు
ఉత్తరప్రదేశ్‌ అలీగఢ్‌లోని ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు సజీవదహనమవ్వగా, ఆరుగురికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అలీగఢ్‌ నగరంలోని తలనగరి ప్రాంతంలో జరిగింది. వారిలో ఐదుగురి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌ మంటలను అదుపులోకి తెచ్చింది. అలాగే ఫ్యాక్టరీలో చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్