హైదరాబాద్ కుర్రాడు తన్మయ్ అగర్వాల్ ట్రిపుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో 323* పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. కేవలం 160 బంతుల్లోనే 323* (33 ఫోర్లు, 21 సిక్సర్లు) పరుగులు చేశాడు. ఈ క్రమంలో తక్కువ బంతుల్లో త్రిశతకం బాదిన తొలి క్రికెటర్గా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు సౌతాఫ్రికాకు చెందిన మార్కో మరైస్ (190 బంతుల్లో) పేరిట ఉంది.