గోల్నాక లో తల్లిపాల వారోత్సవాలు

56చూసినవారు
అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందిస్తున్నామని ఐసీడీఎస్ సూపర్వైజర్ జి. కవిత అన్నారు. తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా బుధవారం గోల్నాకా డివిజన్ కృష్ణనగర్ బస్తీ, అంగన్వాడీ కేంద్రాల్లో తల్లులకు తల్లిపాలపై అవగాహన కల్పించారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి మూడేళ్ల పాటు తల్లి పాలను క్రమం తప్పకుండా ఇవ్వాలని సూచించారు. అంగన్వాడీ టీచర్స్ ఉషారాణి, శివరాణి, నయిమున్నీసా, యశోద, సునిత, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్