చార్మినార్ లో డ్రగ్స్ అమ్ముతున్న యువకుడు అరెస్ట్

79చూసినవారు
చార్మినార్ లో డ్రగ్స్ అమ్ముతున్న యువకుడు అరెస్ట్
పాతబస్తీ శాలిబండ ప్రాంతంలో డ్రగ్స్ కంట్రోల్, పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. చార్మినార్ బస్ స్టాండ్ పార్కింగ్లో డ్రగ్స్కి అలవాటు పడ్డ వారికి నిషేధిత టైడోల్ ట్యాబ్లెట్లు విక్రయిస్తున్న యాకుతురకు చెందిన హర్షద్ ఖాన్ని అరెస్ట్ చేశారు. అతడి వద్ద 100కి పైగా ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ట్యాబ్లెట్లు వాడటం వలన మెదడుపై ప్రభావం చూపి మనిషి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్