గిరిజన బిడ్డకు న్యాయం చేసేదాకా ఊరుకోం - ఏబీవీపీ

3126చూసినవారు
పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో డీఎఈ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ర్యాగింగ్ చేసి ప్రీతి ఆత్యహత్య చేసుకునేలా మానసిక వేదనకు గురి చేసిన సీనియర్ విద్యార్థి సైఫ్‌ను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకుడు జీవన్ డిమాండ్ చేశారు. ఈ ఘటన పట్ల బాధ్యతారహిత్యంగా వ్యవహరించిన కేఎంసీ కళాశాల యాజమాన్యాన్ని, ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా నిరసనకు దిగిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి అఫ్జల్‌గంజ్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్