రహ్మత్ నగర్ బస్తీలో వాటర్ సమస్యలు లేకుండా చూడాలని స్థానికులు సోమవారం కార్పొరేటర్ సీఎన్ రెడ్డిని కలిశారు. వేసవి వేళ త్రాగునీటి కష్టాలు ఉండకుండా చొరవ చూపలన్నారు. బస్తీ నాయకుల వినతి మేరకు కార్పొరేటర్ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.