గోల్కొండలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాదయాత్ర

75చూసినవారు
గోల్కొండ డివిజన్ పరిధిలో గురువారం హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాదయాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ఎంఐఎం పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎంఐఎం ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి పనులపై అవగాహన కల్పించారు. మరోసారి పూర్తి మద్దతును పార్టీకి ఇవ్వాలని, లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ అందించాలని కోరారు. ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.