టెట్ అర్హత పరీక్ష ఫీజు తగ్గించాలి : జాజుల లింగంగౌడ్

52చూసినవారు
టెట్ అర్హత పరీక్ష ఫీజు తగ్గించాలి : జాజుల లింగంగౌడ్
టెట్ అర్హత ఫీజు తగ్గించాలని కోరుతూ టెట్ కన్వీనర్ రాధా రెడ్డి కి వినతి పత్రం సమర్పించినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ మంగళవారం తెలిపారు. లింగంగౌడ్ మాట్లాడుతూ గతంలో టెట్ ఒక పేపర్‌కు రూ. 200 ఫీజు ఉండగా దాన్ని రూ. 1000కి పెంచారని,. రెండు పేపర్లు రాసే అభ్యర్థులకు గతంలో రూ. 300గా ఉన్న ఫీజును ఏకంగా రూ. 2, 000కు వరకు పెంచారని ఫీజులను ఈ స్థాయిలో పెంచడం నిరుద్యోగులకు అన్యాయం చేసినట్టేనని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్