ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు నిరసనగా శనివారం మల్కాజ్ గిరి చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి బతుకమ్మ పండుగను దేశ, విదేశాలకు వ్యాప్తి చేసిన మహిళ నాయకురాలు కవితని బిజెపి ప్రభుత్వం అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేశారని ఆరోపించారు. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.