ఓటర్లకు కృతజ్ఞత తెలిపే ఈటల రాజేందర్

80చూసినవారు
ఓటర్లకు కృతజ్ఞత తెలిపే ఈటల రాజేందర్
మల్కాజిగిరి ఎంపీగా తనను గెలిపించినందుకు ఓటర్లకు కృతజ్ఞత తెలిపే కార్యక్రమంలో ఈటల రాజేందర్ సోమవారం మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లతో సమావేశం కానున్నట్లు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ డీఎన్ వెంకటేశ్ తెలిపారు. ఈమేరకు ముఖ్య నాయకులు ఆదివారం స్థానిక లక్ష్మీసాయి గార్డెన్ లో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రావణ్, రాజ్యలక్ష్మీ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్