చిలకలగూడ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఎస్సై జ్ఞానేశ్వర్ కథనం ప్రకారం. మెట్టుగూడకు చెందిన భరత్ కుమార్ (25) ఇంట్లో గొడవలతో ఈ నెల 5న బయటకు వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులతో కలిసి భార్య వరలక్ష్మి అన్ని చోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం చిలకలగూడ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భరత్ ఆచూకీ తెలిసినవారు తమకు తెలపాలని ఎస్ఐ సూచించారు.