నర్సింగ్‌ విద్యార్థిని శృతి కేసు.. ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు

64చూసినవారు
నర్సింగ్‌ విద్యార్థిని శృతి కేసు.. ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు
హైదరాబాద్ గచ్చిబౌలిలోని రెడ్‌స్టోన్‌ హోటల్‌లో చనిపోయిన నర్సింగ్ విద్యార్థిని శృతిది ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన శృతి (23) ఈ నెల 16న ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించారు. ప్రియుడు జీవన్ తో పెళ్లి విషయంలో గొడవ కారణంగానే శృతి సూసైడ్ చేసుకున్నట్లు తేల్చారు. కాగా, పోలీసులు జీవన్ ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్