న్యాయమూర్తిగా తాను ఎన్నడూ రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొనలేదని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. సమాజంలో న్యాయమూర్తులు పోషించగలిగే మానవీయ పాత్ర గురించి లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనియన్ సొసైటీలో మాట్లాడారు. ప్రభుత్వంలోని రాజకీయ విభాగంతో సంబంధం లేనట్లుగా, ఒంటరిగా ఉంటామని తెలిపారు. అయితే, న్యాయమూర్తులకు తమ తీర్పుల ప్రభావం పరిపాలనపై ఏ విధంగా ఉంటుందో తెలిసి ఉండాలన్నారు.