మలేషియాలోని ఓ రెస్టారెంట్లో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి రెస్టారెంట్లో తినడానికి వెళ్లి నూడుల్స్ ఆర్డర్ చేయగా.. అతనికి నూడుల్స్ గిన్నెలో బ్యాండ్-ఎయిడ్ కనిపించింది. షాన్ జై అనే వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్లో జరిగిన సంఘటనను వివరించాడు. ఈ విషయం చాలా సీరియస్ కావడంతో రెస్టారెంట్ యజమాని షాన్కి క్షమాపణలు చెప్పి, ఉచితంగా ఆహారం అందించారు.