ఉత్తరాదిలో రాబోయే మూడు రోజుల్లో భానుడి భగభగలు కొనసాగుతాయని, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్ధాన్, మధ్యప్రదేశ్లో వీటి తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. దేశ రాజధానిలో శనివారం ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటుతుందని అంచనా వేసింది. గడిచిన 24 గంటల్లో ఒడిశాలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.