పెరిగిన ఆర్టీసీ టికెట్ ధరలు!

76చూసినవారు
పెరిగిన ఆర్టీసీ టికెట్ ధరలు!
తెలంగాణలో టోల్ ప్లాజాలున్న మార్గాల్లో నడిచే బస్సుల్లో టికెట్ ఛార్జీలోని టోల్ రుసుమును టీఎస్ ఆర్టీసీ రూ.3 చొప్పున పెంచింది. కేంద్రం ఇటీవల టోల్ ఛార్జీలు పెంచడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎక్స్ ప్రెస్ లలో రూ.10 నుంచి రూ.13కు, డీలక్స్, లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో రూ.13 నుంచి రూ.16కు, గరుడ ప్లస్ లో రూ.14 నుంచి రూ.17కు, నాన్ ఏసీ స్లీపర్, హైబ్రిడ్ స్లీపర్ లలో రూ.15 నుంచి రూ.18కి, ఏసీ స్లీపర్ లలో రూ.20 నుంచి రూ.23కు పెంచింది.

ట్యాగ్స్ :