పార్లమెంట్లో రాజదండం (సెంగోల్) ఉంచడంపై మళ్లీ దుమారం రేగుతోంది. దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. భారతీయ చరిత్రను, తమిళ సంస్కృతిని సమాజ్వాదీ పార్టీ, ఇండియా కూటమి అగౌరవపరుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సెంగోల్’ భారతదేశానికి గర్వకారణమని, ప్రధాని మోదీ దానికి పార్లమెంటులో అత్యున్నత గౌరవం ఇవ్వడం గౌరవప్రదమైన విషయమని X లో సీఎం యోగి రాసుకొచ్చారు.