ఫైనల్ చేరిన భారత్

52చూసినవారు
ఫైనల్ చేరిన భారత్
ఆసియాకప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. దంబుల్లాలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. దీంతో సగర్వంగా భారత్ ఫైనల్ చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 80/8 స్కోరు సాధించింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా 11 ఓవర్లలో భారత్ చేధించింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన (55*), షెఫాలీ వర్మ (26*) పరుగులతో రాణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్