ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్తో భారత్ అగ్రస్థానానికి దూసుకొచ్చింది. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేయడంతో టీమిండియా 119 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఇక, 110 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్(107), న్యూజిలాండ్(105) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.