ఎల్లుండి అమెరికాకు భారత ఆటగాళ్లు?

73చూసినవారు
ఎల్లుండి అమెరికాకు భారత ఆటగాళ్లు?
టీ20 ప్రపంచ కప్ కోసం ఈనెల 25న టీమిండియా ప్లేయర్లు, సిబ్బంది అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన జట్లలోని ఆటగాళ్లు యూఎస్ విమానం ఎక్కనున్నట్లు సమాచారం. మొదట రోహిత్, కోహ్లీ, హార్దిక్, బుమ్రా, సూర్య, పంత్, అక్షర్, అర్ష్‌దీప్, కుల్దీప్, సిరాజ్‌ వెళ్లనుండగా.. ఐపీఎల్ ఫైనల్ తర్వాత మిగతా ప్లేయర్స్ అక్కడికి చేరుకోనున్నారట. దీనిపై బీసీసీఐ స్పందించాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్