ఐపీఎల్-2024లో భాగంగా నేడు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక గుజరాత్ మూడు మ్యాచ్లు ఆడి రెండు మ్యాచ్లలో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. పంజాబ్ జట్టు మూడు మ్యాచ్లు ఆడి ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది.