ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేయడం మళ్లీ మొదలుపెట్టింది. నిన్న అర్థ రాత్రి దాదాపు 200 డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెల్ స్థావరాలపై దాడులకు దిగింది. మరోవైపు, ఇరాన్ వైపున్న వర్గాలు కూడా ఇజ్రాయెల్పై దాడులు కొనసాగిస్తున్నాయి. ఇక అన్ని వైపులా సైనికులను మోహరించామని, ఇజ్రాయెల్ రక్షణ కోసం సర్వసన్నద్ధంగా ఉన్నామని ఆ దేశ ప్రధాన మంత్రి ప్రకటించారు. ఇజ్రాయెల్కు అమెరికా మద్దతుగా ఉంది.