లెబనాన్‌‌లో ఇజ్రాయెల్ భీకర దాడులు.. 182 మంది మృతి, 700 మందికి గాయాలు (వీడియో)

55చూసినవారు
హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేసింది. సోమవారం ఒక్కరోజే 300లకు పైగా లక్ష్యాలపై విరుచుకుపడింది. దీంతో 182 మంది మృతి చెందినట్లు లెబనాన్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో 700 మందికి గాయాలైనట్లు పేర్కొంది. చనిపోయిన వారిలో చిన్నారులు, మహిళలు, పారామెడికల్‌ సిబ్బంది కూడా ఉన్నారని తెలిపింది. దాడుల్ని అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని ఐరాసతోపాటు శక్తిమంతమైన దేశాలను కోరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్