హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ భీకరదాడులు.. 356కి చేరిన మృతుల సంఖ్య

55చూసినవారు
హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ భీకరదాడులు.. 356కి చేరిన మృతుల సంఖ్య
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన భీకరదాడిలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 356కి చేరింది. మరో 1246 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో 21 మంది చిన్నారులు, 31 మంది మహిళలు ఉన్నారని లెబనాన్ ఆరోగ్యమంత్రి ఫిరాస్ అబియాద్ వెల్లడించారు. హెజ్‌బొల్లాకు చెందిన దాదాపు 1300 ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇప్పట్లో ఈ దాడులను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

సంబంధిత పోస్ట్