పింక్‌ పవర్‌ రన్‌.. ఉత్సాహంగా పాల్గొన్న ఐటీ ఉద్యోగులు

73చూసినవారు
పింక్‌ పవర్‌ రన్‌.. ఉత్సాహంగా పాల్గొన్న ఐటీ ఉద్యోగులు
హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో పింక్‌ పవర్‌ రన్‌ ప్రారంభమైంది. 3కే, 5కే, 10కే పరుగును మంత్రి దామోదర రాజనర్సింహ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున ఐటీ, ఇతర ప్రైవేటు ఉద్యోగులు పాల్గొన్నారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంలో భాగంగా ఈ పింక్‌ పవర్‌ రన్‌ నిర్వహించారు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌లో స్థానం సంపాదించేందుకు సుధారెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్