ముంబై పరేడ్ సందర్భంగా అభిమానులు భారత క్రికెటర్లను పొగిడారు. భారత ఆటగాళ్లకు అపూర్వ స్వాగతం దక్కడంపై కూడా హార్దిక్ తన స్పందనను తెలియజేశాడు. “దేశంలోని 140 కోట్లమంది ఇప్పుడు ఛాంపియన్లు. మా మీద ఇంత ప్రేమ చూపించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మధుర క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేం. వర్షం వస్తున్నా లెక్కచేయకుండా సంబరాల్లో పాల్గొనందుకు థాంక్స్” అని పోస్టు చేశాడు.