రాజ్యాంగాన్ని అవమానించింది రాహుల్ కుటుంబమే: అనురాగ్ ఠాకూర్

78చూసినవారు
రాజ్యాంగాన్ని అవమానించింది రాహుల్ కుటుంబమే: అనురాగ్ ఠాకూర్
లోక్‌సభ సభాపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మరోసారి విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంపై ఎక్కువ ప్రేమ చూపిస్తోందని, రాహుల్ కూడా ప్రతిసారీ రాజ్యాంగ గ్రంథాన్ని చేతిలో పెట్టుకుని తిరుగుతూ ఉంటారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని పూర్తిగా అపహాస్యం చేసింది రాహుల్ గాంధీ అని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని ఎవరైనా అవమానించాంటే.. అది కేవలం రాహుల్ గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీయే అని చురకలు అంటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్