వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. ‘ఢిల్లీని శాసించే కూటమి ఇది. కూటమిలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ వారికి అందరికీ కూడా ఇది గొప్ప విజయం. అభినందనలు. ఓడిపోయినా కూడా నా ప్రతికష్టంలో తోడుగా నిలబడ్డ ప్రతి నాయకుడికి, కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి కూడా స్టార్ క్యాంపెయినర్గా తోడుగా ఉన్న అందరికీ ధన్యవాదాలు”. అని తెలిపారు.