జమ్మూకాశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్‌గా మారదు:ఫరూక్ అబ్దుల్లా

69చూసినవారు
జమ్మూకాశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్‌గా మారదు:ఫరూక్ అబ్దుల్లా
జమ్మూ కాశ్మీర్‌ ఎప్పటికీ పాకిస్థాన్‌గా మారదని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఈ మేరకు గందేర్‌బల్‌లోని గుండ్‌ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. భారత్ లో ఉగ్రవాదం వ్యాప్తి చేయటాన్ని పాక్ ఆపేయాలని హితవుపలికారు. భారత్‌తో సత్సంబంధాలు కావాలంటే ఉగ్ర చర్యలకు స్వస్తి చెప్పాలని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని పెంచిపోషించడం మానుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్‌ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్