స్మార్ట్ కారు, కొత్తతరం డిస్ప్లే ప్రాజెక్టులకు ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ ఇటీవల స్వస్తి పలికింది. దీంతో 600 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ విషయాన్ని కంపెనీ ఇటీవల కాలిఫోర్నియా ‘ఎంప్లాయిమెంట్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్కు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. కొత్తతరం స్క్రీన్ డెవలప్మెంట్పై పనిచేస్తున్న 87 మందిని.. కారు ప్రాజెక్టు నుంచి మిగతావారిని తీసేసినట్లు తెలుస్తోంది.