వాగుపై వంతెన నిర్మించాలని పార్టీ ఇన్ చార్జ్ ఏనుగు రైతుల వినతి

569చూసినవారు
వాగుపై వంతెన నిర్మించాలని పార్టీ ఇన్ చార్జ్ ఏనుగు రైతుల వినతి
బాన్సువాడ మండలంలోని బుడిమి గ్రామ శివారులో రైతులకు ఇబ్బందిగా మారిన తిరుమలాపూర్ బుడిమి గ్రామాలకు మధ్య వంతెన నిర్మించాలని సోమవారం రైతులు పార్టీ ఇన్ చార్జ్ రవీందర్ రెడ్డి దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులతో చర్చించి వంతెన నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, గణేష్, శ్రీనివాసరెడ్డి, కొత్తకొండ భాస్కర్, అన్వర్, నబి, జీవన్, ప్రవీణ్ గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్