ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు ముఖ్య గమనిక. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు తేదీని ప్రకటించారు. ఈ నెల 18 నుంచి 24 వరకు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చని ఏపీ ఇంటర్మీడియట్ విద్యా మండలి తెలిపింది. జనరల్, వృత్తి విద్యా కోర్సుల పరీక్షలకు రూ.550, ప్రాక్టికల్స్కు రూ.250, బ్రిడ్జికోర్సు పేపర్లు రాసేందుకు రూ.150 చెల్లించాలని సూచించింది.