భారత పురావస్తు శాఖ ‘విలేజ్ టు విలేజ్’ ప్రాజెక్ట్ కింద అనేక ప్రాంతాల్లో తొమ్మిదేళ్ల పాటు చేపట్టిన తవ్వకాల్లో 3,100 వారసత్వ అవశేషాలు బయటపడినట్లు భారత పురావస్తు శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. ఈ తవ్వకాల్లో ప్రాచీన ఆలయాల ఆనవాళ్లు, మసీదులు, సమాధులు, చోళుల కాలం నాటి శాసనాలు, పలు రకాల శిలాజాలు వెలుగు చూశాయి. సాలార్జంగ్ మ్యూజియంలో దేశంలోనే మొదటి డిజిటల్ పురాతన శాసనాల అధ్యయన కేంద్రం ఏర్పాటుకు ఇటీవల శ్రీకారం చుట్టారు.