బిచ్కుంద మండల కేంద్రంలో
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగాధర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.