మద్యం సేవించి వాహనం నడిపిన ఓ వ్యక్తికి కామారెడ్డి ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి శివరాత్రి ప్రతాప్ రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ. 200 జరిమానా విధించినట్లు మాచారెడ్డి ఎస్సై శ్రీనివాస్ గౌడ్ గురువారం తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, నిబంధనలను అతిక్రమిస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు.