తాడ్వాయిలో ఘనంగా ఎన్ ఎస్ యు ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో మంగళవారం ఎన్ ఎస్ యు ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు వరుణ్ రావు మాట్లాడుతూ 1971వ సంవత్సరంలో ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలో ఎన్ ఎస్ యు ఐ ఆవిర్భవించిందని, విద్యార్థుల సంక్షేమం, హక్కుల కోసం నిరంతరంగా పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు ప్రశాంత్ గౌడ్, వేణు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.