ఇరువర్గాల ఘర్షణ.. కేసు నమోదు

81చూసినవారు
ఇరువర్గాల ఘర్షణ.. కేసు నమోదు
ఎల్లారెడ్డి మండలం భిక్కనూరు వర్షం నీరు ఇంటిముందు నుండి పోవడంతో మంగలి ఆగమయ్య, మంగలి చిరంజీవులు మధ్య గొడవ జరిగిందని ఎస్ఐ. బొజ్జ మహేష్ బుదవారం తెలిపారు. చిరంజీవులును, ఆగమయ్యను మధ్య మాటలు పెరిగి, చిరంజీవులు కోపంతో ఆగమయ్య అతని కుటుంబ సభ్యులపై దాడి చేయగా ఆగమయ్యకు, అతని కుటుంబ సభ్యులకు గాయలైనట్లు చెప్పారు. ఆగమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.