శవంతో సాహస‌ యాత్ర.. వీడియో

67చూసినవారు
AP: తిరుపతి జిల్లాలోని కస్తూరి నాయుడు కండ్రిగ గ్రామంలో నివాసముంటున్న శంకర్ అనారోగ్యంతో మృతి చెందాడు. అంత్యక్రియలు నిర్వహించాలంటే అరుణా నదికి కాలువను దాటి స్మశానానికి వెళ్లాల్సి ఉంది. తుపాను ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఆ కాలువలో నీళ్లు పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నాయి. గ్రామస్థులు శవాన్ని భుజాలపై మోసుకుని నడుము లోతు నీటిలో కాలువను దాటుకుని స్మశానాన్ని చేరుకుని అంత్యక్రియలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్