చుక్క నీరు లేకుండా పోయింది లింగంపేట్ పెద్ద వాగు

1068చూసినవారు
ఎల్లారెడ్డి సెగ్మెంట్ పోచారం ప్రాజెక్టుకు జలసంపదగా ఉన్న లింగంపేట్ పెద్దవాగు ఎండలకు ఎండిపోయి నిర్జీవంగా మారింది. ఒకప్పుడు నీటితో జలక్షల ఉట్టిపడే ఈ వాగులో చుక్క నీరు లేకుండా పోయిందంటే వాగులో ఇసుక లేకుండా చేయడమే కారణం అన్నది జగమెరిగిన సత్యం. ఈ వాగు పోచారం ప్రాజెక్టు ద్వారా ఎల్లారెడ్డి, లింగంపేట్ మండలాల రైతులకు సాగు నీటిని అందిస్తుంది. వాగుల్లోని ఇసుక అంతమవ్వడమే సజీవ నదులు నిర్జీవంగా మారుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్