ఎల్లారెడ్డి: డబుల్ బెడ్ రూం ఇళ్ల పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి

51చూసినవారు
ఎల్లారెడ్డి: డబుల్ బెడ్ రూం ఇళ్ల పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి
ఎల్లారెడ్డి - సోమార్ పేట్ బైపాస్లో నిర్మాణాలు పూర్తి చేసుకుని, పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్లలో మౌళిక వసతులపనులను త్వరగా పూర్తి చేయాలని, ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నె ప్రభాకర్ కాంట్రాక్టర్ ను ఆదేశించారు. మంగళవారం ఆర్డీఓ అక్కడికి వెళ్లి సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. విద్యుత్, డ్రైనేజీ, త్రాగునీటి సరఫరా పైపు లైన్, ప్లంబింగ్, సీసీ రోడ్డు పనులను దీపావళి లోపు పూర్తి చేయాలన్నారు.