12వ తేదీ నుండి మోగనున్న బడిగంటలు

70చూసినవారు
12వ తేదీ నుండి మోగనున్న బడిగంటలు
సుదీర్ఘ వేసవికాలం సెలవులు ముగించుకుని, బుధవారం నుంచి ప్రభుత్వ బడులు పునః ప్రారంభంకానున్నాయని, ఎల్లారెడ్డి ఎంఈఓ ఎవి వెంకటేశం మంగళవారం తెలిపారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలకు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4. 15 నిమిషాల వరకు, ఉన్నత పాఠశాలాలకు ఉదయం 9. 30 నుంచి సాయంత్రం 4. 45 వరకు బడి సమయం ఉంటుందని తెలిపారు. ప్రార్థన సమయంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్