
ఎల్లారెడ్డి: చెట్లను నాటి సంరక్షిస్తేనే భావితరాలకు మనుగడ
చెట్లను నాటి సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకుంటే భావితరాల మనుగడ సాధ్యమని, ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ ఎ. మహేష్ కుమార్ అన్నారు. బుధవారం అమృత్ మిత్ర 2. 0లో భాగంగా మెప్మా పట్టణ సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా సభ్యులకు పథకం గురించి అవగాహన కల్పించారు. అమృత్ మిత్ర 2. 0 కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం చెట్లను నాటి సంరక్షించే బాధ్యతను మహిళా సంఘాలు తీసుకోవాలన్నారు. పథకానికి సంబంధించి కరపత్రాలు అందించారు.