ఢిల్లీలో జరిగిన NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం సమావేశానికి ముందు మండీ ఎంపీ బాలీవుడ్ నటి కంగనా రనౌత్, లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్లు కలిసి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే అక్కడకు వచ్చిన బండి సంజయ్ శుభాకాంక్షలు తెలుపుదామని కంగనాకు బొకే ఇవ్వగా బండి ఎవరో తెలియని కంగనా పట్టించుకోకుండా వెళ్ళింది. కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.