మల్యాల గ్రామంలో హోలీ సంబరాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో హోలీ పర్వదినం పురస్కరించుకొన సోమవారం గ్రామ యువకులు హోలీ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువుల అతి పెద్ద పండుగ అయిన అన్ని పండగల కన్నా ముందు వచ్చేది హోలీ అన్నారు. తీరుతీరుల రంగులు పూసుకుని హోలీ పండగ జరుపుకోవడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.